www.ntodaynews.com
రైతులతో వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్
రైతులతో వైఎస్ జగన్ భేటీ
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం, వేలం కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పెరిగిన సాగు పెట్టుబడి వ్యయం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రకాశం, నెల్లూరు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన రైతు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రైతుల సమస్యలకు పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించనున్నారు.