BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఉదారత.. విద్యార్థులకు 50 గ్లాసుల విరాళం పోలవరం కెపి మోడల్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి నిరంతర సహకారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 07:33 AM
51 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల, పోలవరం కెపిలో విద్యార్థులు రాగిజావ తాగేందుకు అవసరమైన 50 స్టీల్ గ్లాసులను అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన పగుట్ల ప్రసాదరావు అందజేశారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ సేవను ఉపాధ్యాయులు అభినందించారు.

పగుట్ల ప్రసాదరావు గత కొంతకాలంగా పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ వస్తున్నారు. జాతీయ పర్వదినాల సందర్భంగా నిర్వహించే క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందించడం, సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పరసా శ్రీనివాసరావు, కారుమంచి దేవి, జక్కం రాజేష్, అలమంటి సిరి పగుట్ల ప్రసాదరావును ఘనంగా అభినందిస్తూ, ఆయన సేవాభావం ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.