రూ.40 కోట్లతో 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలు ప్రారంభం
రూ.40 కోట్లతో 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలు ప్రారంభం
అమరావతి: రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధునికీకరణలో భాగంగా రూ.40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 58 నూతన అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సీడ్ యాక్సిస్ రహదారిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
ఈ కొత్త వాహనాల్లో 25 అధునాతన ఫైర్ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ వాహనాలు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.
కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన వాహనాల రాకతో అగ్నిమాపక సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.