రోడ్డు ప్రమాద బాధితులకు త్వరితగతిన బీమా పరిహారం
రోడ్డు ప్రమాద బాధితులకు త్వరితగతిన బీమా పరిహారం అందించేందుకు ‘ఇ-డార్’ (e-DAR) నమోదు...
అన్నమయ్య జిల్లా - మదనపల్లె
రోడ్డు ప్రమాద బాధితులకు త్వరితగతిన బీమా పరిహారం అందించేందుకు ‘ఇ-డార్’ (e-DAR) నమోదు విధానంపై బుధవారం మదనపల్లె డీపీఓలో కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి హాజరై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే వాహనం, బాధితుల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డి.టి.ఆర్.బి. ఇన్స్పెక్టర్ డి. రమేష్ బాబు, ఎన్.ఐ.సి. ప్రతినిధి ఎస్. ఖలీల్, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల కంప్యూటర్ సిబ్బంది పాల్గొన్నారు.