నిలోఫర్, MNJ ఆస్పత్రుల వద్ద ఆస్పత్రుల వద్ద
'రెడీ టు సర్వ్' ఫౌండేషన్ అన్నప్రసాదం
NTODAY NEWS: హైదరాబాద్
ఆకలితో అల్లాడుతున్న వారికి, ఆసుపత్రిలో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి అండగా నిలుస్తూ 'రెడీ టు సర్వ్' ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ ఆధ్వర్యంలో నిలోఫర్, MNJ ఆస్పత్రుల వద్ద అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రుల వద్దకు వచ్చిన 300 మందికి పైగా పేదలకు, రోగుల సహాయకులకు భోజనం అందించారు.సీనియర్ జర్నలిస్ట్ అంజలి, ఆర్జే రాజ్ , నటుడు విజయ భాస్కర్, గాంధీ మిర్యాల, శ్రీదేవి తదితరులు పాల్గొని పేదలకు అన్నం వడ్డించారు. ప్రతి ఆదివారం హైదరాబాద్లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిరాటంకంగా ఈ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పేదలు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ సేవలను కొనసాగిస్తున్నామని ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ తెలిపారు. వాలెంటీర్స్ చైతన్య రాజు లక్ష్మణ్ సైదులు బాలకృష పూరషోత్తం పాల్గొన్నారు ఈ నిరంతర సేవ కార్యక్రమంలో వాలంటీర్లుగా పాల్గొనాలనుకునే వారు లేదా ఈ సేవలకు సహకరించాలనుకునే వారు ఫోన్ : 87908 15527 తమను సంప్రదించాలని కోరారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube