బి.జె.పురంలో 365 మట్టి శివలింగాలకు రుద్రాభిషేకం
ఆంధ్రప్రదేశ్
/
పార్వతీపురం మన్యం
బి.జె.పురంలో 365 మట్టి శివలింగాలకు రుద్రాభిషేకం
శ్రీ సాయి గణేశ్వర యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
బి.జె.పురం గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా కాలనీ వీధిలో శ్రీ సాయి గణేశ్వర యూత్ ఆధ్వర్యంలో 365 మట్టి శివలింగాలకు రుద్రాభిషేకం, లింగార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మహాశివలింగాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, రుద్రాభిషేకం చేశారు. ఈ సందర్భంగా “హర హర మహాదేవ, శంభో శంకర” నామస్మరణలతో కాలనీ వీధి మార్మోగింది. గ్రామానికి చెందిన భక్తులు, యువత, యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. యువతలో ఆధ్యాత్మికత, ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. బి.జె.పురం గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తూ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని శ్రీ పరమేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.