www.ntodaynews.com
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని సాయికృష్ణ నివాసానికి వైఎస్సార్సీపీ నేతలు చేరుకుని ఆయన తల్లి విజయలక్ష్మిని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.
సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, విజయలక్ష్మికి రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.