BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Jun, 2026 - 08:10 PM
63 వీక్షణలు

అన్నమయ్య జిల్లా మదనపల్లి దేశ సేవకు గౌరవం.. వీర జవాన్ కుటుంబానికి, మాజీ సైనికుడికి ఇంటి స్థలాల మంజూరు

దేశ రక్షణ కోసం సేవలందించిన సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక కోటా కింద ఇంటి స్థలాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు కలెక్టర్ అందజేశారు.

మదనపల్లె మండలం కురవంక గ్రామానికి చెందిన దివంగత వీరజవాన్ బి.సాయి తేజ గారి భార్య శ్రీమతి బి. శ్యామలకు ప్రభుత్వం ప్రత్యేక కోటా కింద ఇంటి స్థలం మంజూరు చేసింది. ఈ మేరకు మదనపల్లె మండల పరిధిలో 0.06 సెంట్ల భూమికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను  బి. శ్యామలకు జిల్లా కలెక్టర్ అందజేశారు.

అలాగే యుద్ధంలో అంగవైకల్యం పొందిన మాజీ సైనికుల కోటా కింద మదనపల్లె మండలం ప్రశాంత్‌నగర్‌కు చెందిన మాజీ హవనీర్ వి. సుబ్బారెడ్డికి కూడా 0.06 సెంట్ల భూమికి సంబంధించిన ఇంటి స్థలం మంజూరు ప్రొసీడింగ్స్‌ను కలెక్టర్ అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..., దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల సేవలను ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, వారి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు కొనసాగిస్తుందని తెలిపారు. దేశం కోసం సేవలందించిన సైనికులు, మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.