BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

సభలో అప్రజాస్వామిక హంగామా దురదృష్టకరం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:32 PM
55 వీక్షణలు

సభలో అప్రజాస్వామిక హంగామా దురదృష్టకరం: బట్టి విక్రమార్క

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ సభలో సభ్యునిగా అనేక బడ్జెట్ సమావేశాలను చూసిన నేను, బట్టి విక్రమార్కగా చెప్పదలచుకున్నది ఏమిటంటే—గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలు బడ్జెట్ ప్రతులను చింపివేయడం, చెవిలో పూలు పెట్టుకుని సభను విడిచి వెళ్లడం వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం నిజంగా దురదృష్టకరం.

రాష్ట్రంలోని వృద్ధులు, తల్లిదండ్రుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఒక కీలకమైన బిల్లును ప్రవేశపెట్టింది. అటువంటి ముఖ్యమైన బిల్లుపై చర్చించాల్సింది పోయి, అనుభవజ్ఞులైన సభ్యులే సభా సంప్రదాయాలు, పార్లమెంటరీ విలువలను పక్కనపెట్టి అల్లరి చేయడం శోచనీయం.

సభలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సింది పోయి, కేవలం నినాదాలు, చప్పట్లతో సభ సమయాన్ని వృథా చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం. ప్రజల పక్షాన నిలబడి చర్చలు జరపాల్సిన ఈ వేదికను, స్వార్థ రాజకీయాల కోసం అడ్డుకోవడం సరైంది కాదు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన అందరికీ బీమా, విద్యార్థులకు అల్పాహారం వంటి ప్రజా సంక్షేమ పథకాలపై చర్చ జరగకుండా అడ్డుపడటం ప్రజలను వంచించడమే.

పదేళ్ల పాలన తర్వాత ప్రజలు తమకు మేలు జరుగుతుందని ఆశించి ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్నారు. ఆ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ పవిత్రమైన సభను అంగడిలా మార్చకుండా, ప్రజాస్వామ్యంపై గౌరవంతో సభ నిర్వహణకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాను.