BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

సభలో అప్రజాస్వామిక హంగామా దురదృష్టకరం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:32 PM
80 వీక్షణలు

సభలో అప్రజాస్వామిక హంగామా దురదృష్టకరం: బట్టి విక్రమార్క

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ సభలో సభ్యునిగా అనేక బడ్జెట్ సమావేశాలను చూసిన నేను, బట్టి విక్రమార్కగా చెప్పదలచుకున్నది ఏమిటంటే—గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలు బడ్జెట్ ప్రతులను చింపివేయడం, చెవిలో పూలు పెట్టుకుని సభను విడిచి వెళ్లడం వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం నిజంగా దురదృష్టకరం.

రాష్ట్రంలోని వృద్ధులు, తల్లిదండ్రుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఒక కీలకమైన బిల్లును ప్రవేశపెట్టింది. అటువంటి ముఖ్యమైన బిల్లుపై చర్చించాల్సింది పోయి, అనుభవజ్ఞులైన సభ్యులే సభా సంప్రదాయాలు, పార్లమెంటరీ విలువలను పక్కనపెట్టి అల్లరి చేయడం శోచనీయం.

సభలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సింది పోయి, కేవలం నినాదాలు, చప్పట్లతో సభ సమయాన్ని వృథా చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం. ప్రజల పక్షాన నిలబడి చర్చలు జరపాల్సిన ఈ వేదికను, స్వార్థ రాజకీయాల కోసం అడ్డుకోవడం సరైంది కాదు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన అందరికీ బీమా, విద్యార్థులకు అల్పాహారం వంటి ప్రజా సంక్షేమ పథకాలపై చర్చ జరగకుండా అడ్డుపడటం ప్రజలను వంచించడమే.

పదేళ్ల పాలన తర్వాత ప్రజలు తమకు మేలు జరుగుతుందని ఆశించి ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్నారు. ఆ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ పవిత్రమైన సభను అంగడిలా మార్చకుండా, ప్రజాస్వామ్యంపై గౌరవంతో సభ నిర్వహణకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాను.