BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

సమస్యల వలయాల్లో భువనగిరి కేజీ బీవీలో నీటి కొరత, అధికారులు వచ్చి వెళుతున్నా - సమస్యలు యథాతథం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Jun, 2026 - 09:44 PM
126 వీక్షణలు

భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న  కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం సమస్యలతో సతమతమౌతుంది. సుమారు 300 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్న విద్యాలయంలో నీటి సరఫరాకు సంబంధించిన శాస్వత పరిష్కారం  అధికారులు చేయలేక పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో  నీటి కొరత తీవ్రంగా ఉందని గుర్తించిన అప్పటి భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, ప్రభుత్వ నిధులతో బోరు వేయించారు.ఆ బోరు వర్షా కాలంలో సరిపడా నీటిని అందిస్తున్నా,ఎండా కాలంలో మాత్రం నీటి తిప్పలు తప్పడం లేదు. పాఠశాల ప్రారంభమై వారం రోజుల గడుస్తున్నాయి.ఎండలు ఎక్కువగా ఉండడం, వర్షాలు పడకపోవడంతో నీటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేయడానికి తగినన్ని నీళ్లు లేకపోవడంతో స్నానాలు చేయడం లేదు. ఒకవైపు విపరీతమైన ఎండలు, మరొకవైపు నీటి కొరతతో కొందరు విద్యార్థులు సిక్ లీవ్ పెట్టుకుని ఇళ్ళకు వెళుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇందిరమ్మ కాలనీ వాసులకు, మరియు కేజీ బీవీ పాఠశాల కు వేరువేరుగా ట్యాంకర్ల కేటాయించినా అవి సక్రమంగా నీటి సరఫరా చేయడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. మండల  స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు అనేక మంది అధికారులు పాఠశాల పర్యవేక్షణ పేరుతో సందర్శించినా, నీటి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాలికలకు నీటి వసతి కల్పించాలని బాలికలు, బాలల హక్కుల సంఘం నాయకులు కోరుతున్నారు.