BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

సమస్యల వలయాల్లో భువనగిరి కేజీ బీవీలో నీటి కొరత, అధికారులు వచ్చి వెళుతున్నా - సమస్యలు యథాతథం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Jun, 2026 - 09:44 PM
55 వీక్షణలు

భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న  కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం సమస్యలతో సతమతమౌతుంది. సుమారు 300 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్న విద్యాలయంలో నీటి సరఫరాకు సంబంధించిన శాస్వత పరిష్కారం  అధికారులు చేయలేక పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో  నీటి కొరత తీవ్రంగా ఉందని గుర్తించిన అప్పటి భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, ప్రభుత్వ నిధులతో బోరు వేయించారు.ఆ బోరు వర్షా కాలంలో సరిపడా నీటిని అందిస్తున్నా,ఎండా కాలంలో మాత్రం నీటి తిప్పలు తప్పడం లేదు. పాఠశాల ప్రారంభమై వారం రోజుల గడుస్తున్నాయి.ఎండలు ఎక్కువగా ఉండడం, వర్షాలు పడకపోవడంతో నీటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేయడానికి తగినన్ని నీళ్లు లేకపోవడంతో స్నానాలు చేయడం లేదు. ఒకవైపు విపరీతమైన ఎండలు, మరొకవైపు నీటి కొరతతో కొందరు విద్యార్థులు సిక్ లీవ్ పెట్టుకుని ఇళ్ళకు వెళుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇందిరమ్మ కాలనీ వాసులకు, మరియు కేజీ బీవీ పాఠశాల కు వేరువేరుగా ట్యాంకర్ల కేటాయించినా అవి సక్రమంగా నీటి సరఫరా చేయడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. మండల  స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు అనేక మంది అధికారులు పాఠశాల పర్యవేక్షణ పేరుతో సందర్శించినా, నీటి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాలికలకు నీటి వసతి కల్పించాలని బాలికలు, బాలల హక్కుల సంఘం నాయకులు కోరుతున్నారు.