www.ntodaynews.com
సంచులు మోసే జాతి ఎవరిదో ప్రజలకు తెలుసు: కేటీఆర్
తెలంగాణ
/
మంచిర్యాల
సంచులు మోసే జాతి ఎవరిదో ప్రజలకు తెలుసు: కేటీఆర్
లక్షెట్టిపేట: తెలంగాణలో రెండు రకాల జాతులే ఉన్నాయని, ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, మరొకటి తెలంగాణకు ద్రోహం చేసే జాతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
లక్షెట్టిపేటలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన జాతి తమది కాదని, సమైక్యవాదుల సంచులు మోసిన జాతి కూడా తమది కాదని వ్యాఖ్యానించారు.
నీళ్లు అడిగితే రక్తం చల్లుకోమన్న రాక్షస జాతి తమది కాదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొరికిపోయిన జాతి కూడా తమది కాదని అన్నారు. "ఎవరిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు" అంటూ కేటీఆర్ విమర్శించారు.