BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 03:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సంగారెడ్డి : లంచం తీసుకుంటూ విద్యాశాఖ అధికారి పట్టుబాటు

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 03:26 PM
5 వీక్షణలు

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ కళాశాల తనిఖీ చేసి అనుకూల నివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన విద్యాశాఖ అధికారి గోవింద రాం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలను తనిఖీ చేసిన అనంతరం సానుకూల నివేదిక ఇవ్వాలంటే రూ.50 వేల లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేసినట్లు సమాచారం. గత వారం బాధితుడు రూ.30 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.20 వేల కోసం అధికారి ఫోన్ చేసి డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శాఖ కార్యాలయంలో రూ.20 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం గోవింద రాంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

అనంతరం కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహించి సంబంధిత ఆధారాలను సేకరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.