www.ntodaynews.com
సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు
తెలంగాణ
సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. అల్లిపూర్ లో రూ.500 కోసం కన్న తండ్రిని కొడుకు హత్య చేశాడు. కర్ణాటక నుంచి రెండు నెలల క్రితం వలస వచ్చిన శంకర్ కుటుంబం చెప్పులు అమ్ముకుంటూ జీవిస్తోంది. తాగిన మైకంలో కొడుకు తుకారాం డబ్బుల విషయమై తండ్రితో గొడవపడి, చాకుతో మెడపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో శంకర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.