BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 01 June 2026, 08:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సంక్షేమం - ఎన్డీయేతోనే సాధ్యం: డా. ఉమేష్ రావు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 08:54 PM
101 వీక్షణలు

సంక్షేమం - ఎన్డీయేతోనే సాధ్యం: డా. ఉమేష్ రావు

శ్రీకాళహస్తి : పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సంక్షేమాన్ని చేతల్లో చేసి చూపిస్తున్న ప్రభుత్వం ఎన్డీయే కూటమి ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎం. ఉమేష్ రావు అన్నారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని పూసల వీధిలో పింఛన్ల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గాలి చలపతి నాయుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, ఇతర నాయకులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోందన్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. జూన్ నెల పింఛన్ల పంపిణీ కోసం రూ.2,728 కోట్లు విడుదల చేసినట్లు, అలాగే కొత్తగా 5,606 స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ.65,886.57 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు మరియు అభివృద్ధిని చూసి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో గాలి చలపతి నాయుడు, మిన్నల్ రవి, కోలా ఆనంద్, డా. ఉమేష్ రావు, వజ్రం కిషోర్, చాంద్ బాషా, బి. గిరిధర్, కోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.