సూరంపాలెంలో మన డబ్బు–మన లెక్కలు అవగాహన ర్యాలీ
సూరంపాలెంలో మన డబ్బు–మన లెక్కలు అవగాహన ర్యాలీ
ఏలూరు జిల్లా ముసునూరు మండలం సూరంపాలెం గ్రామంలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో 'మన డబ్బు–మన లెక్కలు' కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని శ్రీ చైతన్య వీఓ పరిధిలోని మొత్తం 34 డ్వాక్రా గ్రూపుల మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము మాట్లాడుతూ, ప్రతి డ్వాక్రా సభ్యురాలు 'మన డబ్బు–మన లెక్కలు' యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ గ్రూపుల ఆర్థిక లావాదేవీలు, పొదుపులు, రుణాల వివరాలను ఎప్పటికప్పుడు స్వయంగా తెలుసుకునేలా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. యాప్ వినియోగంతో పారదర్శకత పెరిగి, గ్రూపుల నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో వెలుగు సీసీ పోతురాజు, బుక్ కీపర్ గుడిమల్ల కిరణ్ కుమారి, డ్వాక్రా గ్రూపుల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.