BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

సూరంపాలెంలో మన డబ్బు–మన లెక్కలు అవగాహన ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 08:20 PM
97 వీక్షణలు

సూరంపాలెంలో మన డబ్బు–మన లెక్కలు అవగాహన ర్యాలీ

ఏలూరు జిల్లా ముసునూరు మండలం సూరంపాలెం గ్రామంలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో 'మన డబ్బు–మన లెక్కలు' కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని శ్రీ చైతన్య వీఓ పరిధిలోని మొత్తం 34 డ్వాక్రా గ్రూపుల మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము మాట్లాడుతూ, ప్రతి డ్వాక్రా సభ్యురాలు 'మన డబ్బు–మన లెక్కలు' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ గ్రూపుల ఆర్థిక లావాదేవీలు, పొదుపులు, రుణాల వివరాలను ఎప్పటికప్పుడు స్వయంగా తెలుసుకునేలా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. యాప్ వినియోగంతో పారదర్శకత పెరిగి, గ్రూపుల నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో వెలుగు సీసీ పోతురాజు, బుక్ కీపర్ గుడిమల్ల కిరణ్ కుమారి, డ్వాక్రా గ్రూపుల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.