BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

సొసైటీ నుంచి రైతుల సభ్యత్వం రద్దు కుట్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 07:22 PM
178 వీక్షణలు

సొసైటీ నుంచి రైతుల సభ్యత్వం రద్దు కుట్ర ఆరోపణలు

ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, 24 మార్చి 2026

రెడ్డిగూడెం పిఎసిఎస్‌లో రైతుల సభ్యత్వాలను రద్దు చేయడానికి కుట్ర జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులపై లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 25, 2026 తేదీతో నోటీసులు సిద్ధం చేసి, 15 రోజుల గడువు ఇస్తున్నట్లు పేర్కొన్న అధికారులు, వాటిని మాత్రం మార్చి 20 నుంచి కొందరికి, మార్చి 24న మరికొందరికి అందజేయడం అనుమానాస్పదమని ఆయన అన్నారు. గడువు ముగిసిన తర్వాత నోటీసులు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

రాబోయే పిఎసిఎస్ ఎన్నికల్లో ఒక పార్టీకి అనుకూలంగా పరిస్థితులు సృష్టించేందుకు రైతుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సరైన కారణాలు లేకుండా నోటీసుల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం అన్యాయమని మండిపడ్డారు.

ఈ విధమైన చర్యలను తక్షణమే నిలిపివేయాలని, ఇప్పటికే జారీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్, జిల్లా కార్యదర్శి కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకులు భీమిరెడ్డి కృష్ణారెడ్డి, గుడిశె ప్రభాకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు పైడిమర్ల శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీపీ మైలమాల కాంతారావు తదితరులు పాల్గొన్నారు.