BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 03 April 2026, 03:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సర్పంచ్‌ల పదవీ కాలం ముగింపు…

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 03:34 PM
501 వీక్షణలు

సర్పంచ్‌ల పదవీ కాలం ముగింపు…  చాట్రాయిలో అధికార యంత్రాంగం హస్తగతం గ్రామ పాలన!

18 గ్రామపంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియడంతో, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని 18 గ్రామపంచాయతీలు ఇప్పుడు అధికార యంత్రాంగం ఆధీనంలోకి వెళ్లాయి. గ్రామ పాలనలో ఖాళీ ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి స్పెషల్ ఆఫీసర్లను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

స్థానిక ప్రజాప్రతినిధుల స్థానంలో అధికారుల పాలన మొదలవడంతో గ్రామాల్లో రాజకీయంగా కూడా చర్చలు జోరందుకున్నాయి. అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయా…? లేక ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటారా…? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

నియమితుల వివరాలు ఇలా ఉన్నాయి:  

బళ్ళా రాజు – (ఎంపీ డీవో) పోలవరం, నరసింహారావుపాలెం, చనుబండ, కృష్ణారావుపాలెం

దేవినేని ధమయంతి - (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ .ఎంపీడీవో ఆఫీస్) ఆరుగొలనుపేట, జనార్ధనవరం

కొప్పినేని అనిల్ – (డిప్యూటీ తహసిల్దార్) చిత్తపూరు, తుమ్మగూడెం

బండారు శివశంకర్ – (వ్యవసాయ అధికారి) చాట్రాయి, కొత్తగూడెం, మర్లపాలెం, సోమవరం

మాసగిరి శ్రీనివాసరావు – (విద్యాశాఖ అధికారి 1) బూరుగుగూడెం, పర్వతాపురం, పోతనపల్లి

వి.ఎస్.వి. బ్రహ్మాచారి –(విద్యాశాఖ అధికారి 2) చిన్నంపేట, కోటపాడు, చీపురుగూడెం

సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో గ్రామస్థాయిలో అధికార వ్యవస్థే కీలక పాత్ర పోషించనున్నది. తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టిన ఈ స్పెషల్ ఆఫీసర్లు అభివృద్ధి కార్యక్రమాలను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో చూడాల్సి ఉంది.

గ్రామాల్లో చర్చ ఇదే…

“ఎన్నికల వరకు అధికారులు పాలన ఎలా ఉంటుందో?” అనే ఆసక్తి ఒకవైపు, “ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుందా?” అనే అనుమానం మరోవైపు వ్యక్తమవుతోంది.