www.ntodaynews.com
సత్తుపల్లి నుంచి విజయవాడకు ఎక్స్ ప్రెస్ బస్సు చార్జీల తగ్గింపు
ఆంధ్రప్రదేశ్
సత్తుపల్లి నుంచి విజయవాడకు ఎక్స్ ప్రెస్ బస్సు చార్జీల తగ్గింపు
సత్తుపల్లి: ప్రయాణికులకు ఊరట కలిగించేలా సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ బస్సు చార్జీలను తగ్గించింది. ఈ విషయాన్ని డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఆంధ్ర సెక్టార్లో నడిచే ఎక్స్ప్రెస్ బస్సులకు విసన్నపేట నుంచి విజయవాడ వరకు 15 శాతం రాయితీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రాయితీతో విసన్నపేట నుంచి విజయవాడకు ప్రయాణ చార్జీ రూ.90 నుండి రూ.80కి తగ్గించబడింది.
ఇప్పటి నుంచి విసన్నపేట–విజయవాడ మార్గంలో కేవలం రూ.80తోనే ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. సత్తుపల్లి డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.