స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండా పాతాలి.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు పుంగనూరు మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది, దానిలో భాగంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండాను 100% స్ట్రైక్ రేట్ తో రెపరెపలాడించడమే లక్ష్యంగా పార్టీ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం పుంగనూరు పట్టణం లో ఉన్న ట్రావెల్స్ బంగ్లా వేదికగా పుంగనూరు మండల జనసైనికుల సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మండల పరిధిలో జనసేన పార్టీ కు బలంగా ఉన్న పంచాయతీ లను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయం కు పంపించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల అధ్యక్షుడు విరూపాక్షి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, మండల నాయకులు శివ కుమార్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి హరి నాయక్, కార్యదర్శి బాలాజీ నాయక్, నాయకులు రమేష్, రవి కుమార్, జనార్దన్ రాయల్,మహేష్, పవన్ కుమార్,శ్రీరాములు, నాగరాజ,శ్రీనివాసులు,మహేష్,సుబ్బు,సుధాకర్, చౌడప్ప, శ్రీనివాసులు, రాజ, రమణ తదితరులు పాల్గొన్నారు