స్వచ్ఛందా సేవల సమూహం గా సోషల్ వర్కర్స్ ఫోరం ఏర్పాటు..
స్వచ్ఛందా సేవల సమూహం గా సోషల్ వర్కర్స్ ఫోరం ఏర్పాటు..
సేవే మార్గం గా మరో అడుగు ముందుకు సోషల్ వర్కర్స్ ఫోరం...
పుంగనూరు సోషల్ వర్కర్స్ ఫోరం ఏర్పాటు...
అన్నమయ్య జిల్లా,పుంగనూరు లో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు అనుహరీతిలో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు,పర్యావరణ పరిరక్షణ,వృద్ధశ్రమం,హంగర్ రిలీఫ్,సంస్కృతిక కార్యక్రమాలు వంటి ఎన్నో రకాలయిన సేవ కార్యక్రమాలను చేపడుతుండడం జరుతున్నది. ఐతే ఈరోజు పుంగనూరు యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మరియు సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని ఉద్దేశంతో దాదాపుగా 14 స్వచ్చంద సేవ సంస్థల వారు ఈరోజు పుంగనూరు సోషల్ వర్కర్స్ ఫోరం ఏర్పాటు చేయడం జరిగినది . ఈ పుంగనూరు సోషల్ వర్కర్స్ ఫారం ముఖ్య ఉద్దేశం నిజంగా ఎవరికైతే సాయం అందాలో అలాంటి వారికి తప్పకుండా ఆ సాయం ను నేరుగా నిస్వార్ధంగా పనిచేస్తున్న సేవా సంస్థల వారు అందజేయాలనె ఉద్దేశంతో ఈ పోరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఫోరంలో వివిధ రకాల సేవా సంస్థల వారి పూర్తి సమాచారంతో కూడిన డేటాను ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ ఫోరం ఉపయోగపడుతుందని, స్వచ్ఛంద సేవ కార్యక్రమం నిర్వహించిన అనంతరం వారు నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన డేటాను వారి సంస్థ ద్వారా పొందుపరిస్తే ఈ ఫోరంలో ద్వారా అందరికీ కనపరచవచ్చునని దీని ద్వారా ఎవరికైనా ఎలాంటి సాయమైనా అందించడానికి చాలా సులభ తరమని ఫొరం ఆర్గనైజర్ కామాటం మణికంఠ ఆచార్య తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన సభ్యులు త్రిమూర్తి రెడ్డి,జాన్,కె.బాలసుబ్రమణ్యం, అమరావతి సురేష్,సతీష్ కుమార్, వెంకటేష్, రాజేంద్ర, కుంచే కుమార్,హరి కుమార్,మంజునాథ్, రాజేంద్ర,జూటూరు సురేష్, రాంకుమార్,మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.