సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్ర లొ మర్చిపోలేను రోజు
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరపురాని రోజు. 1948లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడంతో ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైంది.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడిన రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజలు, అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.
ఈ చారిత్రక పోరాటం ఏ ఒక్క వర్గానికో, ప్రాంతానికో సంబంధించినది కాదు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం సాగిన ప్రజా పోరాటం. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడమే అమరవీరులకు మనం అందించే నిజమైన నివాళి.
తెలంగాణ చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించకుండా, నాటి పోరాటంలో భాగమైన అన్ని వర్గాల త్యాగాలను గౌరవించాలి. చరిత్రను విభజనకు కాకుండా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా మలచాలి.
నాటి పోరాట స్ఫూర్తితో తెలంగాణను మరింత అభివృద్ధి చెందిన, సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రంగా నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
"తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు",
మి
తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి