BREAKING
హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
www.ntodaynews.com

షార్ట్ సర్క్యూట్‌తో పామాయిల్ తోట దగ్ధం.. రైతుకు భారీ నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 08:05 AM
65 వీక్షణలు

షార్ట్ సర్క్యూట్‌తో పామాయిల్ తోట దగ్ధం.. రైతుకు భారీ నష్టం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ పంచాయతీ సూరంపాలెం గ్రామ సమీపంలో కరెంట్ లైన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పులు చెలరేగి పామాయిల్ తోట కాలిపోయింది. ఈ ఘటనలో రైతు బజ్జూరీ రజినికి చెందిన సుమారు 2 ఎకరాల పామాయిల్ మొక్కలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే ఒక బోర్ కూడా కాలిపోవడంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది.

ఘటనపై వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు కనీసం స్పందించలేదని తోట యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో నష్టం మరింత పెరిగిందని బాధిత రైతులు వాపోతున్నారు.

తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి తగిన పరిహారం అందించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.