www.ntodaynews.com
Temple Visit: బోయకొండ గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు, జిల్లా న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లి | NTODAY NEWS
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానాన్ని ఆదివారం పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు శ్రీ మహేశ్వర రావు, శ్రీ టి.సి.డి. శేఖర్, చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ ఎన్. జయసూర్య, జిల్లా జడ్జి శ్రీమతి అరుణ చారుక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు ప్రత్యేక దర్శనం కల్పించి, అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు వారికి దేవస్థాన సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు.