శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు కోటి రూపాయలు పైగా ఆదాయం
ఆంధ్ర రాష్ట్రము, అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు నేడు అనగా 18-05-2026 సోమవారము జరిగిన హుండీ లెక్కింపు నందు దేవస్థాన ఆదాయం 54 రోజులకు గాను నగదు రూపంలో రూ. 1,01,85,400.00, బంగారు 000-029-400 గ్రాములు, వెండి 000-466-000 గ్రాములు, ఫారెన్ కరెన్సీ - 1) Central bank of Kuwait (1/4 Dinar) - 1 Note, Central bank of Kuwait (1/2 Dinar) - 3 notes, 3) Bank Negara Malaysia (1 Ringgit) - 1 Note, 4) Bank of Canada Banquet (10 Dollar) - 12 Notes, 5) Bank of Canada (5 Cinq Doller)- 16 Notes, 6) Singapore (1 Doller) - 1 Note, 7) Turk Lirasi (200)- 1 Note, అన్నదానము వద్ద గల హుండీ వలన రూ. 16,381/-లు మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూ. 60,452.00 వచ్చినవి. సదరు లెక్కింపునకు దేవస్థాన ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి జె. ఏకాంబరం, మదనపల్లి జిల్లా దేవాదాయ అధికారి శ్రీ J. విశ్వనాధ్ గారు, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, చౌడేపల్లి వారు మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
బోయకొండ గంగమ్మ దేవస్థానం కోటి రూపాయలకు పైగా హుండీ ఆదాయం రావడం ఎంతో సంతోషదాయకం ఇందుకు మూలకారుకులైన దేవస్థానం అధికార అర్చక సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు🙏🙏🙏🙏