శ్రీ మాణిక్య వరదా రాజా స్వామి ఆలయ నూతన అధ్యక్షులు ఎన్నిక
శ్రీ మాణిక్య వరదా రాజా స్వామి ఆలయ నూతన అధ్యక్షులు గా కృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం...
అన్నమయ్య జిల్లా,
పుంగనూరు శ్రీ మాణిక్య వరదా రాజా స్వామి ఆలయం నందు నూతన ఆలయ కమిటీ ప్రమాణస్వీకరమహోత్సవం జరిగింది.కార్యనిర్వాహణ అధికారి ఏకంబరం,ఆలయ ఇన్స్పెక్టర్ శశి కుమార్ బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర, రాష్ట్ర మొదలియర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతు ఈ ఆలయం పరశురాముడి చేతుల మీదుగా ప్రతిష్ట చేయబడిన స్వయంబు సతి సమెత వరదరాజస్వామి వారి ఆలయం నకు ధర్మ కర్తలు గా పదవి భాద్యతలు చేపట్టడం మా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నామన్నారు.స్వామి వారికి పలు రకాల సేవలలో ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తామన్నారు.కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు పరమేశ,టీవీఏస్ ప్రసాద్,ధర్మ తేజ,సుబ్రమణి,అరుణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.