BREAKING
నక్కపల్లి రహదారిపై ప్రమాదం.... ఐకేపీ కేంద్రాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ. కరెంట్ కష్టాలు ఉండొద్దు. అధికారులకు వేముల వీరేశం కీలక ఆదేశాలు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుల్లో ఆందోళన శుభ ముహూర్తాలకు బ్రేక్.. మళ్లీ జూన్ 19 తర్వాతే! పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ వివిధ కోర్సులలో చేరడానికి దరఖాస్తులు మనమిత్ర వాట్సాప్ ద్వారా భక్తులకు మరిన్ని సేవలు తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు ఇంధన ధరల పెంపును రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు: కిషన్ రెడ్డి నక్కపల్లి రహదారిపై ప్రమాదం.... ఐకేపీ కేంద్రాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ. కరెంట్ కష్టాలు ఉండొద్దు. అధికారులకు వేముల వీరేశం కీలక ఆదేశాలు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుల్లో ఆందోళన శుభ ముహూర్తాలకు బ్రేక్.. మళ్లీ జూన్ 19 తర్వాతే! పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ వివిధ కోర్సులలో చేరడానికి దరఖాస్తులు మనమిత్ర వాట్సాప్ ద్వారా భక్తులకు మరిన్ని సేవలు తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు ఇంధన ధరల పెంపును రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు: కిషన్ రెడ్డి
www.ntodaynews.com

శుభ ముహూర్తాలకు బ్రేక్.. మళ్లీ జూన్ 19 తర్వాతే!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 May, 2026 - 07:59 AM
14 వీక్షణలు

తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల సందడి తాత్కాలికంగా తగ్గుముఖం పట్టింది. హిందూ పంచాంగం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న అధిక జ్యేష్ఠ మాసం కారణంగా జూన్ 18 వరకు శుభ ముహూర్తాలు లేవని పండితులు పేర్కొంటున్నారు. దీంతో వివాహాలు, గృహప్రవేశాలు, నూతన వ్యాపార ప్రారంభాలు, ఆస్తుల కొనుగోళ్లు, శుభ ఒప్పందాలు వంటి ముఖ్య కార్యక్రమాలను చాలా కుటుంబాలు వాయిదా వేస్తున్నాయి. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ కాలంలో కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం శ్రేయస్కరం కాదని భావించడంతో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ఈ ప్రభావం కేవలం కుటుంబ శుభకార్యాలపైనే కాకుండా వాటిపై ఆధారపడిన అనేక వ్యాపార రంగాలపైనా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సేవలు, డెకరేషన్ వ్యాపారాలు, టెంట్ హౌస్‌లు, ఫోటోగ్రఫీ, మేకప్ ఆర్టిస్టులు, బ్యాండ్ బాజా బృందాలు, పూల వ్యాపారులు వంటి రంగాలు నెలరోజులపాటు పనుల కొరతను ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా ఈ కాలంలో బిజీగా ఉండే వివాహ మండపాలు ఇప్పుడు వెలవెలబోతుండగా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా తగ్గినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

మరోవైపు జూన్ 18 తర్వాత మళ్లీ వరుస ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో అప్పటి నుంచి శుభకార్యాల సందడి భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అనేక కుటుంబాలు తమ కార్యక్రమాలను ఆ తర్వాతి తేదీలకు మార్చుకుంటుండటంతో ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సేవలకు డిమాండ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం నిశ్శబ్దంగా కనిపిస్తున్న ఈ రంగాలు మరో నెల రోజుల్లో మళ్లీ కళకళలాడనున్నాయని వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.