BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

పాఠశాల ప్రిన్సిపల్ కు షోకాజ్ నోటీస్ జారీ

తెలంగాణ
02 Sep, 2025 - 07:29 AM
153 వీక్షణలు
పాఠశాల ప్రిన్సిపల్ కు షోకాజ్ నోటీస్ జారీ NTODAY NEWS: బొమ్మలరామారం బొమ్మలరామారం మండలంలో ప్రభుత్వ పాఠశాల,పల్లె దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మంగళవారం రోజున బొమ్మల రామారం మండలం మేడిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించారు. భోజనం బాగుంటుందా మెనూ ప్రకారం పెడుతున్నారని కలెక్టర్ విద్యార్థిని అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులకి పెట్టే భోజనం నాణ్యత లేకపోవడం సరిగా వండకపోవడం పై ఏజన్సీ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తంచేశారు, మూడు రోజుల్లో పని తీరు మారకపోతే ఏజెన్సీని తొలగించడంజరుగుతుందని హెచ్చరించారు. కలెక్టర్ విద్యార్థులతో మమేకమై మంచిగా చదువుకోవాలని ఏరోజు పాఠాన్ని ఆరోజు పూర్తిగా వచ్చేంతవరకు నేర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు.విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు మెరుగయ్యే విధంగా ఉపాధ్యాయులు బోధన అందించాలన్నారు.స్కూల్ ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడం, పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో షోకాజ్ నోటీసు జారీ చేయమని డీఈఓ ని ఆదేశించారు. అనంతరం మండలంలోని మైలారం గ్రామంలో పల్లె దవాఖాన ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..ఆసుపత్రికి రోజు సిబ్బంది సమయానికి రావాలని చెప్పారు. సమయపాలన పాటించాలని, పాటించిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. రోజు ఓపి కి ఎంత మంది పేషెంట్లు వస్తుంటారని సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో జ్వరాల కేసులు ఎక్కువగా ఉన్నాయా, జ్వరం వచ్చినవారు మరి ఎక్కువగా ఇబ్బంది పడితే భువనగిరి జిల్లా ఆసుపత్రి కి పంపించాల తెలిపారు.ఈ ఆసుపత్రి పరిధిలో ఈ నెల ఈ.డి.డిలు ఎన్నిఉన్నాయో తెలుసుకున్నారు.అన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయ్యేల చూడాలి అన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు.అనంతరం మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్...గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరు అయ్యాయి, అవి ఏ దశల్లో ఉన్నాయో సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు.మంజూరు అయినంత వరకు ఇండ్ల నిర్మాణ పనులు మొదలు అయ్యాయా ఇంకా ప్రారంభించకుండా ఉంటే వెంటనే మొదలు పెట్టేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు, ఇసుక ఉచితంగా ఇస్తున్నారా అని లబ్ధిదారులు అడిగి తెలుసుకున్నారు. ఇటుక,సిమెంట్ కూడా స్థానిక తహసీల్దార్, ఎంపీడిఓ తక్కువ ధరకు మాట్లాడి ఇప్పిస్తున్నార అని ఆరా తీశారు.లబ్ధిదారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని డబ్బులు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని ప్రతి సోమవారం మీ అకౌంట్ లలో డబ్బులు జమ అవుతాయని అన్నారు.దసరా వరకు ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరగా పూర్తిచేసుకుని గృహప్రవేశం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో పి. శ్రీనివాసరావు,ఎంపీడీవో రాజా త్రివిక్రమ్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube