BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి
www.ntodaynews.com

బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు

తెలంగాణ
17 Feb, 2026 - 08:05 PM
263 వీక్షణలు
బీసీ సింహ గర్జన మహాసభ విజయంకోసం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు పుంగనూరు: ఈ నెల 22న నిర్వహించనున్న “బీసీ సింహ గర్జన” మహాసభ విజయవంతం కావాలని కోరుతూ పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభ నేపథ్యంలో, నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు యాదవ్ నాయకత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టి మహాసభ ఘనవిజయం సాధించాలని ప్రార్థించారు. అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత, విద్యార్థులు, కార్మికులు మరియు ప్రజలకు సభలో భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాయకులు మాట్లాడుతూ, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబాటుకు గురైన బీసీ వర్గాలు ఐక్యంగా నిలబడి తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. “బీసీ సింహ గర్జన” సభ బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ కుమ్మర గిరి బాబు, నాయకులు వెంకటేష్ యాదవ్, శంకర్, గణేష్, గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట్ యాదవ్ కూడా పాల్గొన్నారు. #BCSinhagarjana #BCYParty #SocialJustice #Punganur #ChittoorDistrict #PoliticalMeeting #CommunityUnity Follow us on Website Facebook Instagram YouTube