BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు

తెలంగాణ
17 Feb, 2026 - 08:05 PM
228 వీక్షణలు
బీసీ సింహ గర్జన మహాసభ విజయంకోసం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు పుంగనూరు: ఈ నెల 22న నిర్వహించనున్న “బీసీ సింహ గర్జన” మహాసభ విజయవంతం కావాలని కోరుతూ పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభ నేపథ్యంలో, నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు యాదవ్ నాయకత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టి మహాసభ ఘనవిజయం సాధించాలని ప్రార్థించారు. అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత, విద్యార్థులు, కార్మికులు మరియు ప్రజలకు సభలో భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాయకులు మాట్లాడుతూ, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబాటుకు గురైన బీసీ వర్గాలు ఐక్యంగా నిలబడి తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. “బీసీ సింహ గర్జన” సభ బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ కుమ్మర గిరి బాబు, నాయకులు వెంకటేష్ యాదవ్, శంకర్, గణేష్, గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట్ యాదవ్ కూడా పాల్గొన్నారు. #BCSinhagarjana #BCYParty #SocialJustice #Punganur #ChittoorDistrict #PoliticalMeeting #CommunityUnity Follow us on Website Facebook Instagram YouTube