BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 06 February 2026, 06:41 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించాలి

తెలంగాణ
06 Feb, 2026 - 06:41 AM
266 వీక్షణలు
పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించాలి: జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ NTODAY NEWS: భువనగిరి  పదో తరగతి విద్యార్థులు రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ సూచించారు. శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధనా విధానం, పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ‘సి’ కేటగిరీ విద్యార్థులతో సమావేశమై, వెనుకబడిన సబ్జెక్టులపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. రోజూ కనీసం ఒకటి లేదా రెండు సార్లు పునఃఅభ్యాసం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై నిరంతరంగా శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయులు ‘సి’ కేటగిరీ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఫలితాలను మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. #BoardExams #Class10Students #EducationNews #Bhuvanagiri #SchoolInspection #StudentSuccess #AcademicPlanning #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube