BREAKING
హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ
www.ntodaynews.com

విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించాలి

తెలంగాణ
06 Feb, 2026 - 06:41 AM
156 వీక్షణలు
పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించాలి: జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ NTODAY NEWS: భువనగిరి  పదో తరగతి విద్యార్థులు రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ సూచించారు. శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధనా విధానం, పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ‘సి’ కేటగిరీ విద్యార్థులతో సమావేశమై, వెనుకబడిన సబ్జెక్టులపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. రోజూ కనీసం ఒకటి లేదా రెండు సార్లు పునఃఅభ్యాసం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై నిరంతరంగా శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయులు ‘సి’ కేటగిరీ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఫలితాలను మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. #BoardExams #Class10Students #EducationNews #Bhuvanagiri #SchoolInspection #StudentSuccess #AcademicPlanning #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube