www.ntodaynews.com
విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించాలి
తెలంగాణ
పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించాలి: జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ
NTODAY NEWS: భువనగిరి
పదో తరగతి విద్యార్థులు రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ సూచించారు.
శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధనా విధానం, పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ‘సి’ కేటగిరీ విద్యార్థులతో సమావేశమై, వెనుకబడిన సబ్జెక్టులపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. రోజూ కనీసం ఒకటి లేదా రెండు సార్లు పునఃఅభ్యాసం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమని విద్యార్థులను ప్రోత్సహించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై నిరంతరంగా శ్రద్ధ వహించాలని సూచించారు.
అలాగే ఉపాధ్యాయులు ‘సి’ కేటగిరీ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఫలితాలను మెరుగుపరచాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
#BoardExams #Class10Students #EducationNews #Bhuvanagiri #SchoolInspection #StudentSuccess #AcademicPlanning #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube