BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

మరో ఇద్దరు అనాథ చిన్నారులకు ఆసరా

తెలంగాణ
10 Feb, 2026 - 06:53 AM
216 వీక్షణలు
మరో ఇద్దరు అనాథ చిన్నారులకు పవన్ కళ్యాణ్ ఆసరా నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం, ఇల్లు మంజూరు, చదువుల బాధ్యత కలెక్టర్‌కు అప్పగింత NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి కొణిదెల పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు అనాథ చిన్నారులకు ఆయన పూర్తి స్థాయి ఆసరా ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల లంగ్ క్యాన్సర్‌తో తల్లిని కోల్పోయారు. నివాసానికి ఇల్లు లేక, జీవనాధారం లేని పరిస్థితుల్లో ఉన్న ఈ చిన్నారులు తమ దుస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా వీడియో సందేశంగా పంపించారు. ఈ వీడియో పవన్ కళ్యాణ్‌ను కదిలించింది. వెంటనే స్పందించిన ఆయన, చిన్నారులకు తన జీతం నుంచి ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, వారికి తక్షణమే నివాసం కల్పించేలా ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లేదా కాలేజీల్లో చేర్పించి పూర్తి స్థాయి విద్య అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. ఇప్పటికే నియోజకవర్గంలో 42 మంది అనాథ పిల్లలకు తన జీతం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్, ప్రజలను కుటుంబ సభ్యుల్లా చూసుకునే నాయకుడిగా మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు. #PawanKalyan #Pithapuram #HumanityInPolitics #SupportForOrphans #SocialResponsibility #AndhraPradesh #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube