BREAKING
ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్ ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..! నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి.. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్ ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..! నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి.. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
www.ntodaynews.com

మరో ఇద్దరు అనాథ చిన్నారులకు ఆసరా

తెలంగాణ
10 Feb, 2026 - 06:53 AM
248 వీక్షణలు
మరో ఇద్దరు అనాథ చిన్నారులకు పవన్ కళ్యాణ్ ఆసరా నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం, ఇల్లు మంజూరు, చదువుల బాధ్యత కలెక్టర్‌కు అప్పగింత NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి కొణిదెల పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు అనాథ చిన్నారులకు ఆయన పూర్తి స్థాయి ఆసరా ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల లంగ్ క్యాన్సర్‌తో తల్లిని కోల్పోయారు. నివాసానికి ఇల్లు లేక, జీవనాధారం లేని పరిస్థితుల్లో ఉన్న ఈ చిన్నారులు తమ దుస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా వీడియో సందేశంగా పంపించారు. ఈ వీడియో పవన్ కళ్యాణ్‌ను కదిలించింది. వెంటనే స్పందించిన ఆయన, చిన్నారులకు తన జీతం నుంచి ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, వారికి తక్షణమే నివాసం కల్పించేలా ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లేదా కాలేజీల్లో చేర్పించి పూర్తి స్థాయి విద్య అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. ఇప్పటికే నియోజకవర్గంలో 42 మంది అనాథ పిల్లలకు తన జీతం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్, ప్రజలను కుటుంబ సభ్యుల్లా చూసుకునే నాయకుడిగా మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు. #PawanKalyan #Pithapuram #HumanityInPolitics #SupportForOrphans #SocialResponsibility #AndhraPradesh #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube