www.ntodaynews.com
ట్రాక్టర్ ఢీకొని గొర్రెల కాపరి మృతి.. కంబదూరులో విషాదం
ఆంధ్రప్రదేశ్
/
అనంతపురం
అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తూరు గ్రామానికి చెందిన మజ్జిగ తిప్పన్న (74) గొర్రెలను మేపుకొని రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిప్పన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కుటుంబ పోషణ కోసం వృద్ధాప్యంలోనూ గొర్రెల కాపరిగా పనిచేస్తున్న తిప్పన్న మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందుకున్న కంబదూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో కొత్తూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.