www.ntodaynews.com
ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్–2026 సమావేశం
తెలంగాణ
దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్–2026 సమావేశం
కార్యక్రమంలో పాల్గొన్న గొల్లప్రోలు బీజేపీ నాయకులు
NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోరా శివారెడ్డి
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 3 గంటలకు కాకినాడలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్–2026 కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గొల్లప్రోలు మండలానికి చెందిన బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్చి 7 నుండి ఏప్రిల్ 14 వరకు నిర్వహించనున్న ప్రశిక్షణ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్యక్రమ ఇన్చార్జీలు అనుసరించాల్సిన విధానాలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బుర్రా సీతారామాంజనేయ, పెద్దిశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
#Kakinada #BJP #DeendayalUpadhyaya #TrainingAbhiyan #Gollaprolu #AndhraPradesh #PoliticalNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube