మంచిర్యాల నియోజకవర్గంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
తెలంగాణ
మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలతో మంచిర్యాల నియోజకవర్గంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా ఓబీసీ చైర్మన్ వొడ్డే రాజమౌళి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.