BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 24 August 2026, 08:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తేలికపాటి వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 08:45 PM
37 వీక్షణలు

తేలికపాటి వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి పరిసరాల పరిశుభ్రతతోనే అంటువ్యాధులకు అడ్డుకట్ట మున్సిపల్ కమిషనర్ కే. మనోజ

తిరువూరు: తేలికపాటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరువూరు మున్సిపల్ కమిషనర్ కే. మనోజ తెలిపారు. వర్షాల కారణంగా పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు, నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

వర్షాకాలంలో దోమలు, ఈగలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున అపరిశుభ్రతకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలని, చెత్తాచెదారం పేరుకుపోకుండా పారిశుధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతోనే అంటువ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు.

ముఖ్యంగా వర్షాకాలంలో తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, వేడిగా వండిన ఆహార పదార్థాలను తీసుకోవాలని పేర్కొన్నారు. కలుషిత నీరు, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

“మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. వర్షాలు తేలికపాటిగానే ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. మున్సిపాలిటీ చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలి” అని కే. మనోజ కోరారు.

తిరువూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.