BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

తేలికపాటి వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 08:45 PM
26 వీక్షణలు

తేలికపాటి వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి పరిసరాల పరిశుభ్రతతోనే అంటువ్యాధులకు అడ్డుకట్ట మున్సిపల్ కమిషనర్ కే. మనోజ

తిరువూరు: తేలికపాటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరువూరు మున్సిపల్ కమిషనర్ కే. మనోజ తెలిపారు. వర్షాల కారణంగా పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు, నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

వర్షాకాలంలో దోమలు, ఈగలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున అపరిశుభ్రతకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలని, చెత్తాచెదారం పేరుకుపోకుండా పారిశుధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతోనే అంటువ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు.

ముఖ్యంగా వర్షాకాలంలో తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, వేడిగా వండిన ఆహార పదార్థాలను తీసుకోవాలని పేర్కొన్నారు. కలుషిత నీరు, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

“మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. వర్షాలు తేలికపాటిగానే ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. మున్సిపాలిటీ చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలి” అని కే. మనోజ కోరారు.

తిరువూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.