తెలంగాణ డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సూచన
హైదరాబాద్ | Ntoday News
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారన్న అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత పోలీసుల తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని ఆదేశించినట్లు సమాచారం.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది.
ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసినట్లు సమాచారం.