BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ
/ హైదరాబాద్
01 Jun, 2026 - 09:08 PM
70 వీక్షణలు

​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఆవిర్భావ దినోత్సవ వేళ కేసీఆర్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

​గతంలో ఎదుర్కొన్న అణచివేతపై అలుపెరగని పోరాటం చేసి, శాంతియుత పంథాలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని, స్వయం పాలనలోకి వచ్చాక దేశానికే ఒక దిక్సూచిలా మార్చుకోగలిగామని ఆయన పేర్కొన్నారు.

​అభివృద్ధి, ప్రగతికి ఒక చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం ప్రస్తుతం మళ్లీ ప్రమాదంలో పడే పరిస్థితి రాకూడదని కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు