BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 01 June 2026, 09:08 pm
Posted by : V శ్రీనివాస్

​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 09:08 PM
142 వీక్షణలు

​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఆవిర్భావ దినోత్సవ వేళ కేసీఆర్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

​గతంలో ఎదుర్కొన్న అణచివేతపై అలుపెరగని పోరాటం చేసి, శాంతియుత పంథాలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని, స్వయం పాలనలోకి వచ్చాక దేశానికే ఒక దిక్సూచిలా మార్చుకోగలిగామని ఆయన పేర్కొన్నారు.

​అభివృద్ధి, ప్రగతికి ఒక చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం ప్రస్తుతం మళ్లీ ప్రమాదంలో పడే పరిస్థితి రాకూడదని కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు