BREAKING
పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు
www.ntodaynews.com

తెలంగాణ సీఎం రేవంత్‌తో ఒకే బెంచ్‌లో కూర్చున్నా.. రోలర్ రఘు ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 03:27 PM
41 వీక్షణలు

సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిన్ననాటి స్నేహితులుగా, సహాధ్యాయులుగా ఉండటం తరచూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా కమెడియన్ రోలర్ రఘు తన విద్యార్థి దశకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సినిమాల్లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రఘు, అనంతరం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ‘రోలర్ రఘు’గా మరింత ప్రజాదరణ పొందారు. ప్రస్తుతం సినిమాలతో పాటు స్వగ్రామంలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రోలర్ రఘు.. తాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత జెట్టి కుసుమ కుమార్‌లకు కాలేజీ మిత్రుడినని తెలిపారు.

“ముగ్గురం ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఒకే క్లాస్, ఒకే బెంచ్‌లో కూడా కూర్చున్నాం. 1989-90 సమయంలో దోమలగూడ ఏవీ కాలేజీలో కలిసి చదివాం. కుసుమ కుమార్ నాకు బంధువు అవుతారు. అప్పట్లోనే రేవంత్ రెడ్డి, కుసుమ కుమార్ రాజకీయాల వైపు ఆసక్తి చూపించేవారు. నేను మాత్రం వారితో కలిసి రాజకీయాల్లో తిరగలేదు” అని రోలర్ రఘు వెల్లడించారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎదిగిన తర్వాత తన పాత జ్ఞాపకాలను రోలర్ రఘు పంచుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.