BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 03 June 2026, 03:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణకు యూరియా అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. సరిహద్దు చెక్‌పోస్ట్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 03:36 PM
128 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం, వేమిరెడ్డిపల్లి: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు యూరియా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు సమీపంలోని చెక్‌పోస్ట్‌ను విస్సన్నపేట మండల తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, ఎంపీడీవో చిన్న రాట్నాలు, వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి సంయుక్తంగా పరిశీలించారు.

చెక్‌పోస్ట్‌లో ఉన్న భద్రతా ఏర్పాట్లు, వాహనాల తనిఖీ విధానాలను సమీక్షించిన అధికారులు, యూరియా అక్రమ రవాణాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని సంబంధిత సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయ ఎరువుల అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. రైతులకు అందాల్సిన యూరియా దారి మళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.