BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

తెలంగాణకు యూరియా అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. సరిహద్దు చెక్‌పోస్ట్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 03:36 PM
33 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం, వేమిరెడ్డిపల్లి: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు యూరియా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు సమీపంలోని చెక్‌పోస్ట్‌ను విస్సన్నపేట మండల తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, ఎంపీడీవో చిన్న రాట్నాలు, వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి సంయుక్తంగా పరిశీలించారు.

చెక్‌పోస్ట్‌లో ఉన్న భద్రతా ఏర్పాట్లు, వాహనాల తనిఖీ విధానాలను సమీక్షించిన అధికారులు, యూరియా అక్రమ రవాణాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని సంబంధిత సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయ ఎరువుల అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. రైతులకు అందాల్సిన యూరియా దారి మళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.