BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

తెలంగాణలో కరెంట్ షాక్ మృతుల పరిహారం రూ.8 లక్షలకు పెంపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 02:37 PM
26 వీక్షణలు

హైదరాబాద్, జూలై 30: విద్యుత్ ప్రమాదాల్లో మరణించే బాధితుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పరిహారాన్ని తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు సంస్థ వెల్లడించింది.

ఈ పెరిగిన పరిహారం విద్యుత్ శాఖ ఉద్యోగులు కాని బాధితుల కుటుంబాలకు వర్తిస్తుంది. కొత్త విధానం ప్రకారం, మొత్తం రూ.8 లక్షల్లో రూ.7.20 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్‌గా, మిగిలిన రూ.80 వేలను నగదు రూపంలో అందజేస్తారు.

పశువుల మృతికి కూడా పరిహారం పెంచారు. విద్యుత్ ప్రమాదంలో ఆవు, గేదె, దున్నపోతు మృతి చెందితే రూ.40 వేల పరిహారం, గొర్రె లేదా మేక మృతి చెందితే రూ.7 వేల ఆర్థిక సాయం అందజేయనున్నారు.

విద్యుత్ ప్రమాద బాధితులకు మెరుగైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.