తెలంగాణలో కరెంట్ షాక్ మృతుల పరిహారం రూ.8 లక్షలకు పెంపు
హైదరాబాద్, జూలై 30: విద్యుత్ ప్రమాదాల్లో మరణించే బాధితుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా పరిహారాన్ని తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు సంస్థ వెల్లడించింది.
ఈ పెరిగిన పరిహారం విద్యుత్ శాఖ ఉద్యోగులు కాని బాధితుల కుటుంబాలకు వర్తిస్తుంది. కొత్త విధానం ప్రకారం, మొత్తం రూ.8 లక్షల్లో రూ.7.20 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్గా, మిగిలిన రూ.80 వేలను నగదు రూపంలో అందజేస్తారు.
పశువుల మృతికి కూడా పరిహారం పెంచారు. విద్యుత్ ప్రమాదంలో ఆవు, గేదె, దున్నపోతు మృతి చెందితే రూ.40 వేల పరిహారం, గొర్రె లేదా మేక మృతి చెందితే రూ.7 వేల ఆర్థిక సాయం అందజేయనున్నారు.
విద్యుత్ ప్రమాద బాధితులకు మెరుగైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.