BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 23 March 2026, 10:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:46 PM
118 వీక్షణలు

తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు 

తిరుపతి, మార్చి 23: శెట్టిబలిజ జాతి పితామహుడు, ప్రముఖ సామాజిక సేవకుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అధికారులు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ మాట్లాడుతూ, దొమ్మేటి వెంకటరెడ్డి గారు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం చేసిన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన జీవితం, విలువలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

సమాజ అభ్యున్నతికి అంకితభావంతో పనిచేసిన మహనీయుడిగా ఆయన గుర్తింపు పొందారని, విద్య, సామాజిక చైతన్యం, సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేశారని ఎస్పీ వివరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు), శ్రీనివాసులు (క్రైమ్స్), శ్రీనివాసరావు (సాయుధ దళం), ఎస్‌బీ డీఎస్పీ వెంకటనారాయణ, సాయుధ దళం డీఎస్పీ చంద్రశేఖర్, ఏవో సురేష్ కుమార్‌తో పాటు డీపీవో అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.