BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:46 PM
31 వీక్షణలు

తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు 

తిరుపతి, మార్చి 23: శెట్టిబలిజ జాతి పితామహుడు, ప్రముఖ సామాజిక సేవకుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అధికారులు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ మాట్లాడుతూ, దొమ్మేటి వెంకటరెడ్డి గారు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం చేసిన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన జీవితం, విలువలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

సమాజ అభ్యున్నతికి అంకితభావంతో పనిచేసిన మహనీయుడిగా ఆయన గుర్తింపు పొందారని, విద్య, సామాజిక చైతన్యం, సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేశారని ఎస్పీ వివరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు), శ్రీనివాసులు (క్రైమ్స్), శ్రీనివాసరావు (సాయుధ దళం), ఎస్‌బీ డీఎస్పీ వెంకటనారాయణ, సాయుధ దళం డీఎస్పీ చంద్రశేఖర్, ఏవో సురేష్ కుమార్‌తో పాటు డీపీవో అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.