BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
6 వీక్షణలు

లెక్కల్లో లేని రూ.2.48 లక్షల నగదు స్వాధీనం.. రికార్డుల పరిశీలన

తిరుపతి సిటీ: తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అధికారులు కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు.

సాయంత్రం సమయంలో ప్రారంభమైన తనిఖీలతో కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లలో ఆందోళన నెలకొంది. కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించిన ఏసీబీ అధికారులు లెక్కల్లో నమోదు కాని రూ.2.48 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఈ నగదుకు సంబంధించిన వివరాలపై సబ్‌రిజిస్ట్రార్‌ లక్ష్మీదేవిని అధికారులు విచారించారు. అలాగే రిజిస్ట్రేషన్‌ రికార్డులు, దస్తావేజులు, నగదు లావాదేవీల వివరాలను పరిశీలించారు.

తనిఖీల సమయంలో కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లను కూడా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సోమవారం జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను సైతం ఏసీబీ అధికారులు పరిశీలించారు.

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.