తిరువూరు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రరావుకు రెండు పోలీస్ సేవా పతకాలు
తిరువూరు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రరావుకు రెండు పోలీస్ సేవా పతకాలు
విజయవాడ: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించినందుకు తిరువూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రామచంద్రరావుకు అరుదైన గౌరవం లభించింది.
ఉగాది పురస్కారం–2026 సందర్భంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ సేవా పతకంతో పాటు అతి ఉత్కృష్ట సేవా పతకం రెండు పురస్కారాలను ఆయన అందుకున్నారు. 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమక్షంలో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రామచంద్రరావు సేవా పతకాలను స్వీకరించారు.
పోలీస్ శాఖలో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించిన రామచంద్రరావు ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులు అందించడం పట్ల తిరువూరు ప్రాంత పోలీస్ సిబ్బంది, పలువురు అభినందనలు తెలిపారు.