తిరువూరు లో ముగిసిన హిందీ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిచయ్, ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర భాష, ప్రవేశిక, విశారద పూర్వార్ధ, విశారద ఉత్తరార్ధ, ప్రవీణ పూర్వార్ధ, ప్రవీణ ఉత్తరార్ధ హిందీ పరీక్షలు శనివారం, ఆదివారాల్లో ప్రశాంతంగా ముగిశాయి. తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాలకు చెందిన మొత్తం 235 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తిరువూరు సర్వోదయ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో పరీక్షలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని జి. లక్ష్మీ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రచారక్ రేపాక రఘునందన్ పరీక్షలను పర్యవేక్షించారు.