www.ntodaynews.com
తిరువూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం.. ఇంటింటికీ చేరుతున్న సాయం..!
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. విస్సన్నపేట మండలంలో 7,972 మంది లబ్ధిదారులకు రూ.3,40,61,500 నగదు, గంపలగూడెం మండలంలో 11,156 మంది లబ్ధిదారులకు రూ.4,89,15,500 నగదు పంపిణీ చేసేందుకు విడుదల చేసినట్లు ఎంపీడీవోలు సీహెచ్ చిన్న రాట్నాలు, టి సరస్వతి వెల్లడించారు.
గంపలగూడెం మండలం పెనుగొలనులో అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందజేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక ఊరట కలుగుతోంది.
అయితే ఇటీవల కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులు తమకు కూడా త్వరగా పింఛన్లు మంజూరు కావాలని ఎదురుచూస్తున్నారు.