తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపటి నుంచి ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభం
తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపటి నుంచి ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభం
తిరువూరు, ఆగస్టు 4: తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి తొలి సంవత్సరం ప్రవేశాల కోసం ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్రీనివాసరావు తెలిపారు.
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆగస్టు 5 నుంచి 11 వరకు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందాలని కోరారు.
కళాశాలలో బీఏ (హిస్టరీ), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బీకాం (జనరల్), బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ (జువాలజీ), బీఎస్సీ (కెమిస్ట్రీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నిర్ణీత గడువులోపు ఆన్లైన్లో నమోదు చేసుకుని అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రిన్సిపాల్ విజ్ఞప్తి చేశారు.