తిరువూరులో ఆహార విక్రయ కేంద్రాలపై మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
తిరువూరులో ఆహార విక్రయ కేంద్రాలపై మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని హోటళ్లు, ఫుడ్ స్టాల్స్ యజమానులకు హెచ్చరిక
తిరువూరు: తిరువూరు పురపాలక సంఘ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్పై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె. మనోజ పట్టణంలోని పలు ఆహార విక్రయ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిశుభ్రతా పరిస్థితులను తనిఖీ చేశారు.
ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో తప్పనిసరిగా పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలను బహిరంగంగా ఉంచకుండా కప్పి భద్రపరచాలని, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ నిబంధనల ప్రకారం సక్రమంగా పారవేయాలని ఆదేశించారు.
ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్పై మున్సిపల్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కె. మనోజ హెచ్చరించారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.