BREAKING
టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు
www.ntodaynews.com

తిరువూరులో ఆహార విక్రయ కేంద్రాలపై మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 08:47 PM
16 వీక్షణలు

తిరువూరులో ఆహార విక్రయ కేంద్రాలపై మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని హోటళ్లు, ఫుడ్‌ స్టాల్స్‌ యజమానులకు హెచ్చరిక

తిరువూరు: తిరువూరు పురపాలక సంఘ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ స్టాల్స్‌పై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె. మనోజ పట్టణంలోని పలు ఆహార విక్రయ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిశుభ్రతా పరిస్థితులను తనిఖీ చేశారు.

ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో తప్పనిసరిగా పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలను బహిరంగంగా ఉంచకుండా కప్పి భద్రపరచాలని, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ నిబంధనల ప్రకారం సక్రమంగా పారవేయాలని ఆదేశించారు.

ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ స్టాల్స్‌పై మున్సిపల్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కె. మనోజ హెచ్చరించారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.