తిరువూరులో అంగన్వాడీ కార్యకర్తలకు రెండు జతల చీరల పంపిణీ చేసిన శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాస రావు
తిరువూరు, జూలై 30: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వం అందజేస్తున్న రెండు జతల చీరలను గురువారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన కార్యాలయంలో పంపిణీ చేశారు.
నియోజకవర్గంలోని 272 అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వం అందిస్తున్న చీరలను ఎమ్మెల్యే స్వయంగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అలాగే 'తల్లికి వందనం' పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.