తిరువూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఆర్డీఓ ఎ. కుమార్
తిరువూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఆర్డీఓ ఎ. కుమార్ పాల్గొన్నారు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ ఎ. కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం ద్వారా ప్రతి అర్హుడికి పింఛను సకాలంలో, పారదర్శకంగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అర్హులైన ఒక్క లబ్ధిదారుడు కూడా పింఛనుకు దూరం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ సేవలు సులభంగా అందేలా అధికారులు నిరంతరం కృషి చేయాలని తెలిపారు.
లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.