www.ntodaynews.com
తల్లీబిడ్డల ఆరోగ్యానికి మరింత భరోసా
ఆంధ్రప్రదేశ్
/
పశ్చిమ గోదావరి
తల్లీబిడ్డల ఆరోగ్యానికి మరింత భరోసా తణుకులో తల్లీబిడ్డల ఎక్స్ప్రెస్ నూతన వాహనాలు ప్రారంభం
పశ్చిమగోదావరి జిల్లా తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి క్రిటికల్ కేర్ కేంద్రం వద్ద తల్లీబిడ్డల ఎక్స్ప్రెస్కు సంబంధించిన ఐదు నూతన వాహనాలను తణుకు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అత్యవసర సమయంలో మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యంగా నూతన వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి తల్లి, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.