www.ntodaynews.com
‘తల్లికి వందనం’ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జులై 16 నుంచి రూ.13,000 జమ
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
అమరావతి | ఆంధ్రప్రదేశ్ | NTODAY NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులకు శుభవార్త అందించింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జులై 16, 17, 18 తేదీల్లో రూ.13,000 చొప్పున జమ చేయనుంది.
అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలనుకునే వారు https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్ నంబర్, స్కీమ్ టైప్, సంవత్సరం నమోదు చేసి వివరాలను పరిశీలించుకోవచ్చు.
అర్హత కోసం తప్పనిసరి నిబంధనలు:
బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం పూర్తి చేసి ఉండాలి.
ఈ-కేవైసీ (e-KYC) పూర్తిచేయాలి.
విద్యార్థి ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల లేదా కళాశాలలో చదువుతూ ఉండాలి.
ప్రభుత్వం సూచించిన నిబంధనలు పూర్తి చేసిన అర్హుల ఖాతాల్లో నిర్ణీత తేదీల్లో నేరుగా నగదు జమ కానుంది.